ತೆಲುಗು ಸಾಹಿತ್ಯ: ಪರಿಷ್ಕರಣೆಗಳ ನಡುವಿನ ವ್ಯತ್ಯಾಸ
No edit summary |
( ಯಾವುದೇ ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ )
|
೨೩:೪೩, ೧ ಏಪ್ರಿಲ್ ೨೦೦೬ ನಂತೆ ಪರಿಷ್ಕರಣೆ
ತೆಲುಗು ಸಾಹಿತ್ಯಕ್ಕೆ ಸುಮಾರು ಒಂದು ಸಾವಿರ ವರ್ಷಗಳ ಚರೀತ್ರೆ ಇದೆ. ನನ್ನಯ್ಯ ರವರು ಬರೆದ ಭಾರತಮು ಮೊದಲನೆಯ ಕಾವ್ಯ. ಅವರು ಅದಕೆ ಮೊದಲೆ ಜಾನಾಪದ ಗೀತೆಗಳು, ಕೆಲವು ಪದ್ಯಗಳು ಬರೆದಿರುವ ಆಧಾರಗಳಿವೆ. ಗಾಧಾ ಸಪ್ತ ಶತಿ ಯಲ್ಲಿ ತೆಲುಗು ಜಾನಾಪದ ಗೀತೆಗಳ ಪ್ರಸ್ತಾವನೆ ಇದೆ.
ఉపోద్ఘాతము
తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతమం చేసి ఏకంచేయు విషయంలోనైనా, ఓ నదీప్రవాహంలా చిన్న పాయగా మొదలై, ఇంతై ఇంతై వటుండంతై అన్నట్లు మహోన్నత స్థానంలో నిలిచి తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం.
చరిత్ర
గమనిక:ఈ దిగువ పేరాలో కేవలం తెలుగు సాహితీ చరిత్ర నుండి కొన్ని ముఖ్యమైన సంఘటనల క్రమమును మాత్రమే ఇస్తున్నాము, మరింత నిశితమైన, కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్రను చూడగలరు తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరములకోసం తెలుగు సాహితీ కారులను చూడండి
- కాలము దాచుకోని రోజులలో స్త్రీల కోకిల కంఠములలో, కర్షకాది శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, ఘన తెలుగువారి పండుగలలో దారిగా మొదలయినది తెలుగు సాహితీ చరిత్ర
- తరువాత తరువాత క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాలకు ఎక్కినది.
- క్రీస్తు శకము పదకొండవ శతాబ్దములో ఆది కవి నన్నయ్య గారిచేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఓ ఘన యాత్ర మొదలుపెట్టినది.
- ఈ ఆంధ్ర మహాభారతాన్ని పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రనలు పూర్తి చేసినారు, ఇలా వీరి ముగ్గురినీ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
- పదమూడవ శతాబ్దంలో గోన బుద్దారెడ్డి గారు రామాయణాన్ని తెలుగువారికి తెలుగులో అందించినారు.
- పద్నాలుగవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతాన్ని తేట తేట తెలుగులో రచించి తన జన్మతోపాటు మనందరినీ ధన్యులను చేసినారు.
- పోతన గారికి సమకాలీనులైన శ్రీనాథ కవిసార్వభౌముడిని, అతను చేసిన సాహితీ సేవను మరువలేము కదా!
- పదహారవ శతాబ్దంలోని విజయనగర శ్రీ కృష్ణదేవరాయల వారి రాజోచిత తెలుగు సేవను, వారి "దేశ భాషలందు తెలుగు లెస్స" , నవ రత్నాలను వారి ఆముక్త మాల్యదను చెప్పుకోవాలి.
- పదిహేనవ శతాబ్దంలోన ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలినది
- ఇదే కాలములోని పదకవితా పితామహుడైన అన్నమయ్యను వారి వంశీకులను, వారి పాటలను ఎలా మరువ గలము.
- పద కవితలు అన్నాము కాబట్టి క్షేత్రయ్యవారినీ, త్యాగరాజుల వారినీ, భద్రాచల రామదాసును, గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేము.
- బ్రౌను దొర గారి సేవలు బహు శ్లాఘనీయమైనవి.
- ఆధునిక యుగంలోని గురజాడవారినీ, వాడుక భాషా ఉద్యమనేతలనూ, శ్రీశ్రీన,ి నవలా రచయితలను ..... ఇంకా ఎందరో మహానుభావులను చెప్పుకోవాలి
తెలుగు సాహితీ పద్దతులు
తెలుగుసాహిత్యములో భారతీయ సాహిత్యమువలే మరియూ ప్రపంచ సాహిత్యమువలే వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.
ప్రముఖ కావ్యాలు
తెలుగులో వివిధ సాహిత్య రీతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎన్నో కావ్యాలు వచ్చాయి. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం
ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములుకు చెందిన సాహిత్యములు, నవలలు,టీ వీ సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్షులు, చిన్న కథలు,తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి